సచివాలయాల సేవలు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2022-05-19T02:44:57+05:30 IST

సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బు

సచివాలయాల సేవలు అందుబాటులో ఉండాలి
సచివాలయ నోడల్‌ అధికారులతో సమీక్షిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌

కావలి, మే18: సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీవో శీనానాయక్‌ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సచివాలయాల నోడల్‌ అధికారులతో  ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అందచేస్తున్న సేవలపై ప్రజల నుంచి కానీ, ఇతరత్రా కానీ ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల కోసం సచివాలయాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్నింటికి పరిష్కారం లభించింది..? తదితర వివరాలు తెలియచేయాలన్నారు. సచివాలయాల ద్వారా ఏయే పథకాలకు చలానాలు కట్టించుకున్నారు. వాటిని ఎంతవరకు బ్యాంకులో జమ చేశారని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T02:44:57+05:30 IST