సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి
ABN , First Publish Date - 2022-08-17T03:28:56+05:30 IST
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. గ్రా
గుడ్లూరు, అగస్టు 16 : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. గ్రామసచివాలయ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభ మంగళవారం స్ధానిక కల్యాణ మండపంలో నిర్వహించగా, ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సచివాలయ వ్యవస్థ ద్వారా మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. రామాయపట్నం పోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. తొలుత ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులురెడ్డి, తహసీల్ధార్ లావణ్య, ఎంపీపీ పులి రమేష్, సర్పంచులు చాపల రమణయ్య, పాటి వెంకటేశ్వర్లు, గంగవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.