బీజేపీలో చేరికపై సచిన్ పైలెట్ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-07-13T15:45:47+05:30 IST

కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీలో చేరికపై సచిన్ పైలెట్ కీలక ప్రకటన

జైపూర్: కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని సోమవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో తీవ్రంగా విభేదించి.. బీజేపీ చేరిపోతున్నారని వార్తలొచ్చాయి.


ఈ వార్తకు బలాన్నిచ్చే విధంగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కూడా భేటీ అయ్యారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ ఆయన సీఎం గెహ్లాట్ సర్కార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో మకాం వేసిన విషయం తెలిసిందే. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని సంచలన విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-07-13T15:45:47+05:30 IST