రేపు తిరుపతిలో రూటా సదస్సు
ABN , First Publish Date - 2022-08-18T05:47:21+05:30 IST
రాష్ట్రీయ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ సదస్సును శుక్రవారం తిరుపతిలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా రూటా అధ్యక్షుడు మునీర్ అహ్మద్ తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), ఆగస్టు 17: రాష్ట్రీయ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ సదస్సును శుక్రవారం తిరుపతిలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా రూటా అధ్యక్షుడు మునీర్ అహ్మద్ తెలిపారు. ఉర్దూ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సదస్సుకు ఉర్దూ టీచర్లు తప్పక హాజరై విజయవంతం చేయాలని కోరారు.