నిర్లక్ష్యానికి ‘తుప్పు’.. !
ABN , First Publish Date - 2022-06-27T05:25:14+05:30 IST
వివిధ కేసుల్లో యాడికి పోలీస్స్టేషన పరిధిలో పట్టుబడిన సుమారు వంద బైక్లు తప్పు పడుతున్నా.. వాటిని వేలం వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
యాడికి, జూన 26 : వివిధ కేసుల్లో యాడికి పోలీస్స్టేషన పరిధిలో పట్టుబడిన సుమారు వంద బైక్లు తప్పు పడుతున్నా.. వాటిని వేలం వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ బైక్ల రక్షణ పోలీసులకు భారంగా మారుతోంది. కరోనా సమయంలో, నాటుసారా రవాణా కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్రవాహనాలను పోలీస్స్టేషన ఆవరణంలో ఉంచడంతో ఆ ప్రాంతం మొత్తం వాటితో నిండిపోయింది. ఇక కొత్తగా వాహనాలు తెస్తే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది.