ఉక్రెయిన్లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థుల ఇబ్బందులు...
ABN , First Publish Date - 2022-02-25T19:41:18+05:30 IST
కీవ్: ఉక్రెయిన్లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
కీవ్: ఉక్రెయిన్లో కృష్ణాజిల్లాకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, చాలా కష్టాలు పడుతున్నామని విద్యార్థిని శీలం రాధిక ఓ వీడియో పంపారు. ప్రస్తుతానికి మెట్రో స్టేషన్లోని బేస్మెంట్లో ఉండమని చెప్పారని, అక్కడికి వెళ్లేసరికి ఉక్రెయిన్ స్థానికులతో ఆ ప్రాంతం నిండిపోయిందని చెప్పారు. ఇక్కడ తమ పరిస్థితి బాగోలేదని, మంచినీటి సరఫరా లేదని, కరెంట్ కూడా కట్ అవుతుందని చెబుతున్నారని ఆమె అన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని, కనీసం కూర్చోడానికి స్థలం కూడా లేదని వాపోయారు. నరేంద్ర మోదీ స్పందించి తమను కాపాడాలని రాధిక విజ్ఞప్తి చేశారు.