‘ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్న పాలకులు’
ABN , First Publish Date - 2022-05-18T05:57:38+05:30 IST
‘ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్న పాలకులు’
కొడంగల్ రూరల్, మే 17: పాలకులు ప్రజలకు హామీలు ఇవ్వడమే తప్పా వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎంఐఎం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్ ఆరోపించారు. మంగళవారం ఆయన తాండూర్ రోడ్డులో గల షాదీఖానాను ఎంఐఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పాలకులు ముస్లిం మైనారిటీలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడమే తప్పా వారి అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. కొడంగల్ షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రకటించినా.. కాగితాలకే పరిమితం అయిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి హయాం నుంచి షాదీఖానా గురించి ప్రస్తావిస్తున్నా.. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. వారం రోజుల్లో షాదీఖానా నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు. నాయకులు ఎండీ.ముర్తజా, షేక్ రుమాన్, ఎండీ. అజహర్, షేక్ ఆబీద్ తదితరులున్నారు.