పాలకులు సుపరిపాలన అందించాలి
ABN , First Publish Date - 2020-02-20T09:05:53+05:30 IST
పాలకులు మంచి పాలన అందించాలని అలాంటివారికి పార్టీలకతీతంగా తమ మద్దతు ఉంటుందని త్రిదండి
టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సన్మాన కార్యక్రమంలో చినజీయర్స్వామి
మండపేట, ఫిబ్రవరి 19: పాలకులు మంచి పాలన అందించాలని అలాంటివారికి పార్టీలకతీతంగా తమ మద్దతు ఉంటుందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి భరోసా ఇచ్చారు. మండపేట మండలం అర్తమూరులో బుధవారం వైసీపీ నాయకుడు కర్రి పాపారాయుడు నేతృత్వంలో సత్యభాస్కర హైస్కూల్ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణదంతులకు చినజీయర్ స్వామివారు వెండి కిరీటం, స్వర్ణకంకణం బహూకరించి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో చినజీయర్స్వామి మాట్లాడుతూ తాను పుట్టిపెరిగిన అర్తమూరులో అడుగు పెట్టినపుడు మనస్సు పులకించిపోతుందన్నారు. తన చిన్ననాటి బాల్యస్మృతులను ఆయన గుర్తుచేసుకున్నారు.
టీటీడీ ధార్మిక కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జీయర్స్వామి వారి సూచనలు, సలహాల మేరకు తిరుపతి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కర్రి పాపారాయుడు నేతృత్వంలో సుబ్బారెడ్డి, స్వర్ణ దంపతులకు చినజీయర్స్వామి వెండి కిరీటం, స్వర్ణ కంకణం బహూకరించి సత్కరించారు. తొలుత కర్రి పాపారాయుడు ఇంటి నుంచి హైస్కూల్ ప్రాంగణానికి జీయర్స్వామి ఊరేగింపుగా తరలివచ్చారు.
మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పినిపే విశ్వరూప్ కన్నబాబు, ఎంపీలు భరత్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణుగోపాల్, సత్తి సూర్యనారాయణరెడ్డి, పర్వత పూర్ణచంద్రప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్, నాగులపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బిక్కిక కృష్ణార్జున చౌదరి, రౌతు సుర్యప్రకాశరావు, కుడిపూడి చిట్టబ్బాయి, ఆకుల సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు, స్థానిక నాయకులు గోలుగురి విజయభాస్కరరెడ్డి, చంటిరెడ్డి సత్తిబుల్లిస్వామిరెడ్డి, కామత్ సుధాకర్, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈసందర్భంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, స్వర్ణ దంపతులకు జిల్లాలో ఉన్న అన్నవరం, అంతర్వేది, అయినవిల్లి, వాడపల్లి దేవస్థానాలకు చెందిన ఆర్చకులు వచ్చి వేద ఆశీర్వాదాలు అందజేశారు.