జాతీయస్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ABN , First Publish Date - 2021-12-06T04:39:40+05:30 IST

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పిఠాపురం పట్టణం, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు.

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
క్రీడాకారులతో కోచ్‌ లక్ష్మణరావు తదితరులు

పిఠాపురం, డిసెంబరు 5: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పిఠాపురం పట్టణం, తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఒడిసాలోని భువనేశ్వర్‌లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పురుషుల విభాగంలో షేక్‌ బషీర్‌, పీతా సురేంద్ర, మహిళల విభాగంలో ఏ.శివగంగ, ఎం.ధరణి మహాలక్ష్మి, సీనియర్‌ విభాగం నుంచి బళ్ల వంశీ ఎంపికయ్యారని జిల్లా రగ్బీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్‌, కోచ్‌ లక్ష్మణరావు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు గండేపల్లి బాబి, కొత్తపల్లి బుజ్జి తదితరులు అభినందించారు.

Updated Date - 2021-12-06T04:39:40+05:30 IST