ఆప్ఘన్కు భారత రాయబారిగా రుద్రేంద్ర టాండన్
ABN , First Publish Date - 2020-08-08T22:01:55+05:30 IST
ఆప్ఘనిస్తాన్కు భారత్ తదుపరి రాయబారిగా 1994 బ్యాచ్కు చెందిన ఫారెన్ సర్వీస్ అధికారి రుద్రేంద్ర టాండన్ను..
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్తాన్కు భారత్ తదుపరి రాయబారిగా 1994 బ్యాచ్కు చెందిన ఫారెన్ సర్వీస్ అధికారి రుద్రేంద్ర టాండన్ను నియమించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టాండన్ ప్రస్తుతం సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఏఎస్ఈఏఎన్)కు భారత్ రాయబారిగా సేవలు అందిస్తున్నారు. టాండాన్ త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని ఆశిస్తున్నట్టు ఎంఈఏ శనివారంనాడు ఒక ప్రకటనలో పేర్కొంది.