రాట్నాలమ్మ దర్శిని బస్సు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-27T05:45:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ, దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో ఏలూరు కొత్తబస్టాండ్‌ నుంచి రాట్నాలమ్మ దర్శిని సూపర్‌ లగ్జరీ బస్సులు ఆర్టీసీ టీపీటీవో ఎన్‌వీఆర్‌ ప్రసాదరావు ప్రారంభించారు

రాట్నాలమ్మ దర్శిని బస్సు ప్రారంభం
ఏలూరు కొత్తబస్టాండ్‌ నుంచి రాట్నాలమ్మ దర్శిని బస్సుయాత్ర ప్రారంభిస్తున్న అధికారులు

ఏలూరు కలెక్టరేట్‌, మే 26 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ, దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో ఏలూరు కొత్తబస్టాండ్‌ నుంచి రాట్నాలమ్మ దర్శిని సూపర్‌ లగ్జరీ బస్సులు  ఆర్టీసీ టీపీటీవో ఎన్‌వీఆర్‌ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రదర్శిని పేరుతో వారానికి రెండు రోజులు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. గురువారం అంబికా దర్బార్‌ బత్తి సంస్ధ నుంచి 72 మంది సిబ్బంది రాట్నాలమ్మ దర్శిని బస్సులో బయలుదేరి వెళ్ళారు. ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు మాట్లాడుతూ భక్తులు వెళ్లే ప్రతి చోట ఆలయాల్లో ప్రత్యేక దర్శనంతో పాటు తీర్ధ ప్రసాదాలు, మద్ది ఆంజనేయ స్వామి కోవెలలో అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాట్నాలమ్మ దర్శిని పేరుతో రాట్నాలకుంట, పెదవేగి, మద్ది ఆంజనేయస్వామి కోవెల, పారి జాతగిరి, ఐఎస్‌ జగన్నాధపురంలో ఉన్న ఆలయాలు సందర్శిస్తారని తెలిపారు. అంబికా సంస్థల డైరెక్టర్‌ అంబికా శివ మాట్లాడుతూ ఆధ్యాత్మిక టూరు ప్యాకేజీ గురించి తెలియగానే తమ సంస్థ నుంచి 72 మందిని పంపించినట్లు తెలిపారు. డిపో మేనేజర్‌ బి.వాణి, పీఆర్వో నరసింహం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-27T05:45:48+05:30 IST