ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-03-04T07:42:16+05:30 IST

వి.కోటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెకు చెందిన సుజాత (35) మృతి చెందగా, ఆమె భర్త కుమార్‌వేల్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సుజాత మృతదేహం, గాయపడ్డ కుమార్‌వేల్‌

భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు


వి.కోట, మార్చి 3: వి.కోటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెకు చెందిన సుజాత (35) మృతి చెందగా, ఆమె భర్త కుమార్‌వేల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కుమార్‌వేల్‌ దంపతులు చెల్దిగానిపల్లె నుంచి వి.కోటకు  ద్విచక్ర వాహనంపై వస్తుండగా అంబాలాల్‌ జువెలరీస్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని వి.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుజాత తలకు బలమైన గాయం కావడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు సీఐ ఎల్లమరాజు తెలిపారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-03-04T07:42:16+05:30 IST