కరోనా టీకా తీసుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!
ABN , First Publish Date - 2021-03-07T17:04:44+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిద్దరూ నాగపూర్లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కరోనా టీకా టీకా వేయించుకున్నారు. దీనికి ముందు ప్రధాని మోదీ కరోనా టీకా తొలిడోసును ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తీసుకున్నారు.