అల్లర్లలకు పాల్పడితే రౌడీషీట్‌

ABN , First Publish Date - 2021-02-27T05:36:48+05:30 IST

విజయనగరం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే రౌడీషీట్‌ తెరుస్తామని డీఎస్పీ పి.అనిల్‌ కుమార్‌ హె చ్చరించారు.

అల్లర్లలకు పాల్పడితే రౌడీషీట్‌

విజయనగరం క్రైం: విజయనగరం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే రౌడీషీట్‌ తెరుస్తామని డీఎస్పీ పి.అనిల్‌ కుమార్‌ హె చ్చరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి నాగవంశం వీధిలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్‌ల్లో పాత రౌడీషీటర్లను, అనుమానితులను స్టేషన్‌కు పిలి పించి కౌన్సెలింగ్‌ ఇచ్చి, అనంతరం బైండోవర్‌ చేస్తామ న్నారు. ఇప్పటికే వీరందరికీ నోటీసు లు జారీ చేశామ ని, ఇటువంటి వారు ఎన్నికల సమయంలో గొడవ లకు దిగితే శాశ్వత రౌడీషీట్లను తెరుస్తామన్నారు. 


Updated Date - 2021-02-27T05:36:48+05:30 IST