విశాఖలో ‘రౌడీ బాయ్స్’ సందడి
ABN , First Publish Date - 2022-01-17T06:16:24+05:30 IST
దిల్ రాజు ప్రొడక్షన్లో ఆశీష్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, కోమలి హీరోయిన్లుగా హర్ష దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ చిత్రం యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది.
బైక్ ర్యాలీకి అనుమతించని పోలీసులు
జగదాంబ థియేటరో ప్రేక్షకులను కలిసిన చిత్ర యూనిట్
విశాఖపట్నం, జనవరి 16: దిల్ రాజు ప్రొడక్షన్లో ఆశీష్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, కోమలి హీరోయిన్లుగా హర్ష దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ చిత్రం యూనిట్ ఆదివారం విశాఖలో సందడి చేసింది. ఈనెల 14న సినిమా విడుదలైన విషయం తెలిసిందే. విజయ యాత్రలో భాగంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహణకు యూనిట్ సభ్యులు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అనుమతించ లేదు.
దీంతో చిత్రం ప్రదర్శి స్తున్న జగదాంబ థియే టర్ను యూనిట్ సభ్యులు సందర్శించి ప్రేక్షకులతో కలిసి కాసేపు సినిమా చూశారు. అనంతరం నోవాటెల్లో నిర్వహించిన విలే ఖరుల సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ సిని మా విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల టాక్తోనే చిత్రం సూపర్ హిట్ అనిపించుకుందని, బాగున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువయ్యిందన్నారు.
చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ చిత్రం పూర్తిగా మ్యూజికల్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అన్నారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ నా తొలి చిత్రాన్ని జగదాంబా థియేటర్లో ప్రేక్షకు లతో కలిసి చూడడం గొప్ప అనుభూతి అన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు హర్ష, హీరోయిన్లు, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.