అంతర్గత రోడ్లు అధ్వానం : ఎమ్మెల్యే దృష్టికి పాగోలు దళితులు
ABN , First Publish Date - 2022-08-10T06:48:12+05:30 IST
అంతర్గత రోడ్లు అధ్వానం : ఎమ్మెల్యే దృష్టికి పాగోలు దళితులు
చల్లపల్లి : పాగోలు పంచాయతీ పరిధిలో మంగళవారం నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో రహదారుల దుస్థితిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు స్వయంగా పరిశీలించారు. పాగోలు దళితవాడ, ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఇందిరమ్మ కాలనీలో మట్టి రోడ్లు, పల్లంగా ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి రోడ్లన్నీ బురదకయ్యలుగా మారాయి. కాలనీలో ప్రజలు ఎమ్మెల్యేకు రహదారుల సమస్యలను ఏకరువు పెట్టారు. రోడ్ల నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఏఎంసీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, సర్పంచ్ తోట శ్రీనివాసరావు, ఎంపీటీసీ మేకా బంగారు బాబు, సర్పంచ్లు వల్లూరు ఉమా, డొక్కు నాగేశ్వరరావు, ఈవోపీఆర్డీ బూరేపల్లి అశోక్, కార్యదర్శి ఆకుల సాంబశివరావు, వైసీపీ నేత వేమూరి గోవర్థనరావు తదితరులు పాల్గొన్నారు.