‘రొడ్డా భవానీది ప్రభుత్వ హత్యే’

ABN , First Publish Date - 2022-08-10T06:54:21+05:30 IST

చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణం రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఆరోపించారు.

‘రొడ్డా భవానీది ప్రభుత్వ హత్యే’

అమలాపురం రూరల్‌, ఆగస్టు 9: చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ బలవన్మరణం రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఆరోపించారు. భవానీ కేసును తప్పుదారి పట్టించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. ఈ కేసును హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, వైసీపీ నాయకుడు దంగేటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ప్రభాకర్‌తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ బృందం మంగళ వారం కామనగరువులోని భవానీ కుటుంబ సభ్యులను పరామర్శించింది. కమిటీ సభ్యులు కోనాల లాజర్‌, ఎం.జాన్‌రాజు, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి గెడ్డం రవీంద్రబాబు, శివప్రసాద్‌, బొంతు రమణ, జిల్లెల్ల మనోహర్‌, మచ్చా నాగయ్య, అమలదాసు బాబూరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:54:21+05:30 IST