పాత కృష్ణాదేవిపేటలో పథకాల పేరుతో దోపిడీ!

ABN , First Publish Date - 2022-01-25T06:38:13+05:30 IST

గొలుగొండ మండలం పాత కృష్ణాదేవిపేటలో కొంతమంది వైసీపీ నాయకులు పథకాల పేరుతో దోపిడీకి పాల్పడు తున్నారని అదే పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌ పందిరి సత్యంనాయుడు, పాలకవర్గ సభ్యులు, వైసీపీ నాయకుడు పుట్టా చిన్నాస్వామి ఆరోపించారు.

పాత కృష్ణాదేవిపేటలో పథకాల పేరుతో దోపిడీ!
విలేఖరుల సమావేశంలో పాల్గొన్న సర్పంచ్‌ సత్యంనాయుడు, వైసీపీ నాయకులు

  గ్రామ వైసీపీ నాయకులపై అదే పార్టీకి చెందిన సర్పంచ్‌, కార్యవర్గ సభ్యులు, పలువురు నాయకులు ఆరోపణ 

 తక్షణమే చర్యలు తీసుకోకుంటే పార్టీ మారేందుకు వెనుకాడబోమని స్పష్టీకరణ

కృష్ణాదేవిపేట, జనవరి 24 : గొలుగొండ మండలం పాత కృష్ణాదేవిపేటలో కొంతమంది వైసీపీ నాయకులు  పథకాల పేరుతో దోపిడీకి పాల్పడు తున్నారని అదే పార్టీకి చెందిన  గ్రామ సర్పంచ్‌ పందిరి సత్యంనాయుడు, పాలకవర్గ సభ్యులు, వైసీపీ నాయకుడు పుట్టా చిన్నాస్వామి ఆరోపించారు. సోమ వారం సాయంత్రం గ్రామంలో వారు విలేఖర్లతో మాట్లాడుతూ సదరు నాయ కులు గ్రామంలో మంచిపని చేయకపోగా, మంచి చేస్తున్న ప్రజాప్రతినిధులపై వైసీపీ నాయకులు పసగడుగుల గిరిబాబు, నాగేశ్వరరావు, అర్జునరావు, వరహాలబాబు, నానాజీ తదితరులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మం డిపడ్డారు. వైసీపీ నాయకుడు గిరిబాబు వలంటీర్ల ఉద్యోగం ఇప్పిస్తామని నిరు ద్యోగుల వద్ద, ఇళ్ల పట్టాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి పలువురి వద్ద వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని, వెంటనే సదరు నాయకులపై చర్యలు తీసుకోకుంటే తామంతా పార్టీ మారేం దుకు వెనుకాడబోమని  స్పష్టం చేశారు. అలాగే, గ్రామంలో ఏళ్లతర బడి ప్రభుత్వ స్థలంలో పూరిల్లు కట్టు కుని నివశిస్తున్న  దళిత మహిళలపై దౌర్జ న్యం చేసేందుకు సదరు నాయ కులు ప్రయత్నించారన్నారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు మేకా భాస్కరరావు, ఆరు గుర్లు రమణ, చుక్కుల సత్యనారాయణ, స్కూల్‌ పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ అనిశెట్టి గోపిలతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:38:13+05:30 IST