అయి భీమవరం రోడ్డు గోతులు పూడ్చారు
ABN , First Publish Date - 2022-07-07T05:12:33+05:30 IST
ప్లీజు.. ఇటు రాకండి అంటూ ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఆకివీడు, జూలై 6: ప్లీజు.. ఇటు రాకండి అంటూ ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రహదారిలో గోతులు పూడ్చే పనులు ప్రారంభించిన ఆర్అండ్బీ ఏఈ శ్రీహరిరాజు మాట్లాడారు. అయి భీమవరం నుంచి గుమ్ములూరు 6 కిలో మీటర్లు వరకు సీఆర్ఎఫ్ నిధులు రూ.12కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇటీవల ఆకివీడు నుంచి గుమ్ములూరు వరకూ డాంబర్ రోడ్డు పనులు పూర్తయ్యాయని, ఇంకా 300 మీటర్లు పనులున్నాయన్నారు. అయి భీమవరం రోడ్డు పరిస్థితి గోతులతో ఉండడంతో ముందుగా ఆకివీడు నుంచి అయి భీమవరం శివారు వరకు గోతులు పూడ్చి డాంబర్ రోడ్ నిర్మిస్తామన్నారు. స్థానికులు, ప్రయాణికులు, ప్రజలు ఆంధ్రజ్యోతిని అభినందించారు.