రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-05-27T02:59:34+05:30 IST
అల్లూరు ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి ప్రమాదానికి గురై ఓ వ్యక్తి చెందాడు. పోలీసుల కథనం మేరకు, అల్లూరుకు చెందిన చె
అల్లూరు, మే 26 : అల్లూరు ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి ప్రమాదానికి గురై ఓ వ్యక్తి చెందాడు. పోలీసుల కథనం మేరకు, అల్లూరుకు చెందిన చెక్కా రవికుమార్ (56) అల్లూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న సమయంలో పట్టణ శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సమీపానికి వచ్చేసరికి ముందుగా వెళ్తున్న ట్రాక్టరులో ఉన్న తాటిదుంగలకు ఢీకొన్నాడు తీవ్ర గాయాలైన అతన్ని హుటాహుటిన అల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కనీసం నర్సు కూడా విధుల్లో లేకపోవడంతో ప్రాథమిక చికిత్స కూడా అందించే దిక్కులేకుండా పోయింది దీంతో క్షతగాత్రుడిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
సకాలంలో చికిత్స అంది ఉంటే..
అల్లూరులోని 50 పడకల ఆసుపత్రి పేరుకు మాత్రమే. కనీసం ప్రాథమిక చికిత్స అందించలేని దౌర్భాగ్యం పరిస్థితి ఇక్కడుంది. బుధవారం రాత్రి రవికుమార్కు సకాలంలో చికిత్స అందించి ఉంటే బతికి ఉండేవాడేమోనని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.