రోడ్డు పనుల నిలిపివేత
ABN , First Publish Date - 2021-03-05T15:19:47+05:30 IST
స్థానిక చెరువు బజారులో రేణుకా పరమేశ్వరి అమ్మవారి..
జగ్గయ్యపేట: స్థానిక చెరువు బజారులో రేణుకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పక్కన నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను మున్సిపల్ అధికారులు గురువారం నిలిపివేశారు. ‘ఆంధ్రజ్యోతి’తో పాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన కాంట్రాక్టర్ రోడ్డు వేసేందుకు తీసుకొచ్చిన ట్రాక్టర్లు, జేసీబీలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. తన నివేశన స్థలంలో రోడ్డు వేసేందుకు పురపాలక సంఘం యత్నించటం, ఆ స్థలంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించటంపై మాజీ కౌన్సిలర్ తాళ్లూరి సోమయ్య న్యాయ పోరాటానికి సిద్ధమవుతుండటం, ఆ పనులకు, తనకు సంబంధం లేదని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన నేపథ్యంలో ఏఈ డి.హనుమంతురావు సెలవుపై వెళ్లిపోయారు. కాగా, తన స్థలంలో రోడ్డు నిర్మిస్తున్న కాంట్రాక్టర్, అధికారులపై సోమయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జగ్గయ్యపేట పోలీసులు విచారణ ప్రారంభించారు.