బ్లాక్ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలి
ABN , First Publish Date - 2022-01-28T07:32:56+05:30 IST
రోడ్డు ప్రమాదాలను నివారించి బ్లాక్ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలని అర్బన్ ఎస్పీ ఐశ్వర్యరస్తోగి అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ డి.సురేంద్రనాథ్ బృందంతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.
- ఎన్ హెచ్ఎఐ బృందం సమీక్షలో ఏపీ ఐశ్వర్యరస్తోగి
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 27: రోడ్డు ప్రమాదాలను నివారించి బ్లాక్ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలని అర్బన్ ఎస్పీ ఐశ్వర్యరస్తోగి అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ డి.సురేంద్రనాథ్ బృందంతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరం పరిధిలోని ప్రాణాంతక జంక్షన్లు, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. ప్రాణనష్టం జరగకుండా బ్లాక్ స్పాట్లను గురించి వాటిని నియంత్రించేందుకు ఎన్హెచ్ఏఐ రూపొందిస్తున్న ప్రణాళికలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి పలు సూచనలు చేశారు. రాజమహేంద్రవరం, 16వ నెంబరు జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించారు.