బ్లాక్‌ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలి

ABN , First Publish Date - 2022-01-28T07:32:56+05:30 IST

రోడ్డు ప్రమాదాలను నివారించి బ్లాక్‌ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలని అర్బన్‌ ఎస్‌పీ ఐశ్వర్యరస్తోగి అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్‌పీ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ డి.సురేంద్రనాథ్‌ బృందంతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.

బ్లాక్‌ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలి

  • ఎన్‌ హెచ్‌ఎఐ బృందం సమీక్షలో ఏపీ ఐశ్వర్యరస్తోగి

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 27: రోడ్డు ప్రమాదాలను నివారించి బ్లాక్‌ స్పాట్లు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని మార్చాలని అర్బన్‌ ఎస్‌పీ ఐశ్వర్యరస్తోగి అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్‌పీ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ డి.సురేంద్రనాథ్‌ బృందంతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరం పరిధిలోని ప్రాణాంతక జంక్షన్లు, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. ప్రాణనష్టం జరగకుండా బ్లాక్‌ స్పాట్లను గురించి వాటిని నియంత్రించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ రూపొందిస్తున్న ప్రణాళికలను ఎస్‌పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌పీ ఐశ్వర్యరస్తోగి పలు సూచనలు చేశారు. రాజమహేంద్రవరం, 16వ నెంబరు జాతీయ రహదారిపై బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించారు.

Updated Date - 2022-01-28T07:32:56+05:30 IST