రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-02-25T05:45:01+05:30 IST
బంధువుల ఊరిలో దేవరకు వచ్చిన ఇద్దరు యువకులు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యు వాత పడ్డారు.
బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
ఎమ్మిగనూరు,
ఫిబ్రవరి 24: బంధువుల ఊరిలో దేవరకు వచ్చిన ఇద్దరు యువకులు బుధవారం జరిగిన
రోడ్డు ప్రమాదంలో మృత్యు వాత పడ్డారు. ఎమ్మిగనూరు సమీపంలోని బీఈడీ కాలేజీ
వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్పై వెళుతున్న లోకేష్(25), వీరేష్
(24) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఎమ్మిగనూరు మండలం కడివెళ్లకు చెందిన లోకేష్ కోడుమూ రులోని తన అవ్వదగ్గర
ఉంటూ వలంటీరుగా పనిచేసేవాడు. ఇతనికి మూడునెలల క్రితం వివాహం జరిగింది.
శీరాలదొడ్డిలోని బంధువులు దేవరకు ఆహ్వానించడంతో బెళగల్కు చెందిన బంధువు
వీరష్తో కలిసి బైక్పై వచ్చాడు. ఇద్దరూ భోజనం చేసి ముగతి గ్రామానికి
వెళ్లి వస్తామని బైక్పై బయలుదేరారు. తిరిగి రాత్రి శీరాలదొడ్డికి
వెళుతుతుండగా బీఈడీ కళాశాల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా
గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న
బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని బోరున విలవించారు. లోకేష్ భార్య
రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. రూరల్ పోలీసులు ప్రమాద
స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించారు. బొలేరో ట్రాలీ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు
పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.