రోడ్డు ప్రమాదంలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ మృతి

ABN , First Publish Date - 2021-01-25T06:47:25+05:30 IST

ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టిన ఘటనలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ మృతి చెందిన సంఘన మచీలిపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై పామర్రు బైపాస్‌ వద్ద ఆదివారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ మృతి

పామర్రు, జనవరి 24 : ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టిన ఘటనలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ మృతి చెందిన సంఘన మచీలిపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై పామర్రు బైపాస్‌ వద్ద ఆదివారం జరిగింది. గుంటూరుకు చెందిన సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ తూమాటి గిరిబాబు(45) మచిలీపట్నంలో కంపెనీ పని ముగించుకుని తిరిగి విజయవాడ బైక్‌పై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఎస్సై జి.శ్రీహరిబాబు బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.   

Updated Date - 2021-01-25T06:47:25+05:30 IST