రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
ABN , First Publish Date - 2021-04-13T05:39:22+05:30 IST
రెండు బైక్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటన పాలకొల్లు రూరల్ మండలం పూలపల్లిలో హైవేపై జరిగింది.
పాలకొల్లు రూరల్, ఏప్రిల్ 12 : రెండు బైక్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటన పాలకొల్లు రూరల్ మండలం పూలపల్లిలో హైవేపై జరిగింది. ఎస్ఐ రెహ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కంతేటివారిపాడు గ్రామస్థుడు కుడిపూడి శ్రీనివాస్ భీమవరం పైపు వెళుతుండగా ఫోన్ రావడం తో రోడ్డుపక్కన ఆగి మాట్లాడుతుండగా వీరవాసరానికి చెందిన చేవూరి నాగ మోహనరావు వెనుక నుంచి మోటారు సైకిల్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెనుక నుంచి ఢీకొట్టిన నాగమోహనరావు (52) తీవ్రంగా గాయపడి, పాలకొ ల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. గాయపడిన శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.