ఆటోను ఢీ కొట్టిన లారీ - ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు.

ABN , First Publish Date - 2022-06-12T01:22:43+05:30 IST

ఏలూరు జిల్లా : నూజివీడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా..8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పది మంది కూలీలు

ఆటోను ఢీ కొట్టిన లారీ - ఇద్దరు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు.

ఏలూరు జిల్లా : నూజివీడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా..8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పది మంది కూలీలు మామిడి కోతలకు వెళ్ళి ఆటోలో తిరిగి ఇంటికి బయల్దేరారు. మిట్టగూడెం వద్ద డ్రైవర్ ఆటోను కాసేపు రోడ్డు పక్కన ఆపాడు. ఇంతలో వేగంగా దూసుకువచ్చి లారీ ఆటోను ఢీకొట్టింది. ఒక్కసారిగా కూలీలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. గాయపడ్డ వారిలో ఎక్కువ శాతం మహిళలు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నూజివీడు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-12T01:22:43+05:30 IST