రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-04-11T05:04:25+05:30 IST
మండల పరిఽధిలోని కుర్నూతల వంతెన వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది.
వట్టిచెరుకూరు, ఏప్రిల్10: మండల పరిఽధిలోని కుర్నూతల వంతెన వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పిల్లి రాజేష్, అతని భార్య జ్యోతి (35) బుల్లెట్పై గుంటూరులో పనులు ముగించుకుని శనివారం సాయంత్రం తిక్కిరెడ్డిపాలెం వెళుతున్నారు. కుర్నూతల వంతెన వద్ద ప్రత్తిపాడు నుంచి సైకిల్పై వస్తున్న వ్యక్తిని తగిలి కిందపడిపోయారు. అదే సమయంలో గుంటూరు నుంచి వారి వెనుక వస్తున్న లారీ జ్యోతిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వట్టిచెరుకూరు ఎస్ఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.