Road Accident.. కామారెడ్డి జిల్లా: రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి
ABN , First Publish Date - 2022-09-15T17:08:48+05:30 IST
కామారెడ్డి (Kamareddy): జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం లో చిరుతపులి మృతి చెందింది.
కామారెడ్డి (Kamareddy): జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో చిరుతపులి (Leopard) మృతి చెందింది. సదాశివనగర్ మండలంలోని బైపాస్ అటవీ ప్రాంతం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చిరుత వయసు ఏడాది నుంచి ఏడాదిన్నర ఉంటుందని అంచనా వేశారు. చిరుత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.