ప్రమాదంలో కాపరి.. 35 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2021-03-05T06:04:42+05:30 IST

మండలంలోని పెదవడ్లపూడి గ్రామ పరిధిలోని విజేత స్కూల్‌ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కాపరితో పాటు 35 గొర్రెల మృతి చెందాయి.

ప్రమాదంలో కాపరి.. 35 గొర్రెల మృతి
ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు

మంగళగిరి, మార్చి 4: మండలంలోని పెదవడ్లపూడి గ్రామ పరిధిలోని విజేత స్కూల్‌ సమీపంలో  బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కాపరితో పాటు 35 గొర్రెల మృతి చెందాయి. శ్రీకాకుళానికి చెందిన గొర్రెల కాపరులు మంగళగిరి వైపు నుంచి తెనాలి వైపు గొర్రెలు తోలుకువెళుతున్నారు. అదే సమయంలో మంగళగిరి నుంచి తెనాలి వైపు వెళుతున్న ఓ కారు చిమ్మచీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో  గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న గొర్రెలకాపరిని కూడా కారు ఢీకొట్టింది. దీంతో 35 గొర్రెలతో పాటు శ్రీకాకుళానికి చెందిన కాపరి రాముడు(32) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని రూరల్‌ పోలీసులు తెలిపారు.  


Updated Date - 2021-03-05T06:04:42+05:30 IST