Kurnool: తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-19T17:11:05+05:30 IST

కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.

Kurnool: తుంగభద్ర జలాశయానికి  పెరుగుతున్న వరద

కర్నూలు జిల్లా (Kurnool dist.): కర్ణాటక (Karnataka) సహా తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర (Tungabhadra) జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. డ్యాం ఎగువన పల్నాడు (Palnadu) ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద (Heavy flood) వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 31 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం: 1631 అడుగులుంది. ఇన్ ఫ్లో 167281, అవుట్ ఫ్లో 1,50,503 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 98.258 టీఎంసీలుంది.


కాగా తుంగభద్ర జలాశయానికి సోమవారం 1.64 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాయంత్రానికి డ్యాంలో వరద నీరు పెరగడంతో టీబీపీ ఇంజనీర్లు అప్రమత్తమయ్యారు. గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు.. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు. 1630.90 అడుగుల వద్ద 97.635 టీఎంసీలు నిల్వ చేసి నదికి 1,63,090 క్యూసెక్కులు, హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయచూరు మెయిన్‌ కెనాల్‌ ఇలా వివిధ కాలువలకు 6,984 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2022-07-19T17:11:05+05:30 IST