ఘనంగా శ్రీరామానుజ తిరునక్షత్రం

ABN , First Publish Date - 2021-04-19T04:49:59+05:30 IST

మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరం దివ్యసాకేతంలో

ఘనంగా శ్రీరామానుజ తిరునక్షత్రం
పూజలు నిర్వహిస్తున్న చిన జీయర్‌స్వామి

శంషాబాద్‌రూరల్‌ : మండల పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరం దివ్యసాకేతంలో శ్రీరామానుజ 1004వ తిరునక్షత్ర మహాత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీరామన్నారాయణ రామానుజు చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు జలాభిషేకం, పాలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు అహోబిల జీయర్‌స్వామితో కలిసి నిర్వహించారు. ఉత్సవాలను ఆన్‌లైన్‌లో భక్తులు వీక్షించవచ్చని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవానాద జీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-19T04:49:59+05:30 IST