ఘనంగా గురుపౌర్ణమి
ABN , First Publish Date - 2021-07-25T05:45:42+05:30 IST
గురు పౌర్ణమి సందర్భంగా శనివారం జిల్లాలోని షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
గురు పౌర్ణమి సందర్భంగా శనివారం జిల్లాలోని షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన ఈస్ట్ షిర్డీ బాబా ఆలయంలో భక్తులు వివిధ రకాల మిఠాయిలు, పండ్లు స్వామికి నివేదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పంచామృత, విభూది అభిషేకాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.