ఘనంగా అనంతుని గిరి ప్రదక్షిణ
ABN , First Publish Date - 2021-01-16T04:34:44+05:30 IST
పద్మనాభంలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో కనుమ సందర్భంగా నిర్వహించే అనంతుని గిరి ప్రదక్షిణ ఆలయానికే పరిమితం చేశారు.
పద్మనాభం, జనవరి 15: పద్మనాభంలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలో కనుమ సందర్భంగా నిర్వహించే అనంతుని గిరి ప్రదక్షిణ ఆలయానికే పరిమితం చేశారు. కనుమ సందర్భంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత అనంతుని ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పల్లకిలో ఊరేగించి ఉత్సవాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లభించలేదు. కార్యక్రమంలో ఈఓ ఎన్.లక్ష్మీనారాయణశాస్త్రి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అనంతుని పరస జరిగింది. పరిసర గ్రామాల ప్రజలు అనంతుని దర్శనానికి తరలివచ్చారు.