నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2021-04-13T04:55:30+05:30 IST
నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని వయోజన విద్య ఏపీవో రమేష్, సూపర్వైజర్ కృష్ణకిషోర్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో
అనంతసాగరం, ఏప్రిల్ 12: నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని వయోజన విద్య ఏపీవో రమేష్, సూపర్వైజర్ కృష్ణకిషోర్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. వలంటీర్ల సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించి పది మందితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హేమలత, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు ఉన్నారు.