Revanth tweet: డబుల్ బెడ్రూం ఇళ్లు ఏళ్లు గడుస్తున్నా తీరని గోస..
ABN , First Publish Date - 2022-07-25T22:01:01+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.)పై ట్వీట్ (Tweet) చేశారు. ‘‘కాంగ్రెస్ (Congress) హయాంలో సామాన్యుడికి ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) ఒక భరోసా... టీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు (Double bedroom houses) ఏళ్లు గడుస్తున్నా తీరని గోస... మొదట డబుల్ బెడ్ రూం ఇస్తానన్నారు... తర్వాత సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తానన్నారు... అదీ లేదు.. ఇదీ లేదు. ‘డబుల్' మోసం (Double fraud) అంటే ఇదే.’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.