విశ్రాంత ఉపాద్యాయుడు మృతి
ABN , First Publish Date - 2021-02-27T05:58:15+05:30 IST
ఉపాద్యాయుడిగా 38 ఏళ్లపాటు పని చేసి ఆదర్శ ఉపాద్యాయుడిగా నిలిచిన విఽశ్రాంత ఉపాధ్యాయుడు పోలవరం సుబ్బరాయుడు(93) అలియాస్ ఈగలపాటి పంతులు శుక్రవారం వయోభారంతో మృతిచెందారు.
పలువురి సంతాపం
తాళ్లూరు, ఫిబ్రవరి 26 : ఉపాద్యాయుడిగా 38 ఏళ్లపాటు పని చేసి ఆదర్శ ఉపాద్యాయుడిగా నిలిచిన విఽశ్రాంత ఉపాధ్యాయుడు పోలవరం సుబ్బరాయుడు(93) అలియాస్ ఈగలపాటి పంతులు శుక్రవారం వయోభారంతో మృతిచెందారు. ఆయన మృతి పట్ల మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, ఆయన శిష్యులు, బొద్దికూరపాడు గ్రామపెద్దలు తీవ్రదిగ్ర్బాంతి, విచారంవ్యక్తం చేశారు. వృత్తిరీత్యా వివిధ గ్రామాల్లో పనిచేసినప్పటికీ, చివరిగా స్వగ్రామం బొద్దికూరపాడులోనే పనిచేసి అక్కడే నివాసముంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత ఎస్.అంజిరెడ్డి, వెలుగువారిపాలెం హెచ్ఎం పి.సుబ్బారెడ్డి, బొద్దికూరపాడు ఉపసర్పంచ్ పులి ప్రసాద్రెడ్డి, మాజీ సర్పంచ్ పులి కృష్ణారెడ్డి, మాధవ స్వామి ఆలయకమిటీ ఛైర్మన్ పులి బ్రహ్మారెడ్డి, పులి అంజిరెడ్డి తదితరులు విచారం వ్యక్తం చేశారు.