నూతన విద్యావిధానంపై పునరాలోచించండి

ABN , First Publish Date - 2021-06-11T05:13:23+05:30 IST

రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్‌ కోరారు.ఈ మేరకు గురువారం విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

నూతన విద్యావిధానంపై పునరాలోచించండి
రాజాం: ఎంపీ బెల్లానకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్‌ నేతలు

రాజాం: రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుపై పునరాలోచించాలని  ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్‌ కోరారు.ఈ మేరకు గురువారం విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లా తిరుపతిరావు, రాజాం జోన్‌ నాయకులు మురపాక వెంకటరమణ, లంక రామకృష్ణ పాల్గొన్నారు పాలకొండ:  నూతన విద్యా విధానంలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో సంస్కరణలపై  పునరాలోచించాలని ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.వి.రమణ, ఎ.నాగరాజు, జిల్లా కార్యదర్శి కె.పద్మజ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, డీసీసీబీ  మాజీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ, జిల్లా కౌన్సిలర్‌ ఎం.సంపత్‌కుమార్‌, పి.శ్రీరాములునాయుడు పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-06-11T05:13:23+05:30 IST