సలుగుపల్లిలో మళ్లీ విజృంభించిన అతిసార
ABN , First Publish Date - 2022-08-11T04:02:46+05:30 IST
మండలంలోని సలుగుపల్లి గ్రామంలో బుధవారం మళ్లీ అతిసార విజృంభించ డంతో పదిమందికి వాంతులు,విరేచనాలు అయ్యాయి.
- పదిమందికి వాంతులు, విరేచనాలు
బెజ్జూరు, ఆగస్టు 10: మండలంలోని సలుగుపల్లి గ్రామంలో బుధవారం మళ్లీ అతిసార విజృంభించ డంతో పదిమందికి వాంతులు,విరేచనాలు అయ్యాయి. మూడురోజులక్రితం అతిసార ప్రబలడంతో గ్రామంలో ఇప్పటికీ పలువురిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించడంతో కొంత అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ గ్రామానికిచెందిన మడే అంసుబాయి, కొడితే సింధుజ, కుడుమేత లలిత, కొంగ శ్రీనివాస్, ఎనుక గంగారాం, మడే మల్లయ్య, సంజీవ్, తలండి రవళి, సడమేక నిహారిక, బండి సుజాతకు వాంతులు విచేరనాలు కావడంతో పీహెచ్సీలో వైద్యం అందిస్తు న్నారు.