రక్తదాన శిబిరానికి స్పందన

ABN , First Publish Date - 2021-03-08T05:42:32+05:30 IST

సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జోడుగుళ్లు బంగారమ్మతల్లి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది.

రక్తదాన శిబిరానికి స్పందన
రక్తదాన శిబిరంలో పాల్గొన్న సర్పంచ్‌ దెడ్డం ప్రసాదరావు

సబ్బవరం, మార్చి 7 : సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జోడుగుళ్లు బంగారమ్మతల్లి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్‌ దెడ్డం ప్రసాదరావు ప్రారంభించారు. పలు గ్రామాలకు చెందిన సుమారు వంద మంది యువకులు పాల్గొని 70 యూనిట్ల రక్తం దానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ప్రాంతీయ వైద్యాలయం సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అప్పలరాజు, ఉప సర్పంచ్‌ మండల లక్ష్మణరావు, పల్ల తాతారావు, బంగారుతల్లి భక్త బృందం సభ్యులు, ఎన్టీఆర్‌ ప్రాంతీయ వైద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:42:32+05:30 IST