ఆర్ఏఆర్ఎస్లో నేడు, రేపు పరిశోధన విస్తరణ మండలి సమావేశం
ABN , First Publish Date - 2021-04-19T06:58:30+05:30 IST
తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్)లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీ ఆఽధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణమండల పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశం నిర్వహిస్తున్నారు.
తిరుపతి(విద్య), ఏప్రిల్ 18: తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్)లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ వర్సిటీ ఆఽధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణమండల పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈమేరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏఆర్కే రావు తెలిపారు. ఈ సమావేశంలో ఖరీఫ్, రబీ పంటకాలంలో చేపట్టబోవు పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలు, వివిధ పంటల సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. దక్షిణ మండలి జిల్లాల శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, కేవీకే, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు హాజరవుతారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం సమావేశం జరుగుతుందని ఏడీఆర్ డాక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.