ఆర్‌ఏఆర్‌ఎస్‌లో నేడు, రేపు పరిశోధన విస్తరణ మండలి సమావేశం

ABN , First Publish Date - 2021-04-19T06:58:30+05:30 IST

తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ వర్సిటీ ఆఽధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణమండల పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశం నిర్వహిస్తున్నారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌లో నేడు, రేపు  పరిశోధన విస్తరణ మండలి సమావేశం

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 18: తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌)లో ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ వర్సిటీ ఆఽధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణమండల పరిశోధన, విస్తరణ సలహామండలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈమేరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఏఆర్‌కే రావు తెలిపారు. ఈ సమావేశంలో ఖరీఫ్‌, రబీ పంటకాలంలో చేపట్టబోవు పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలు, వివిధ పంటల సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. దక్షిణ మండలి జిల్లాల శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, కేవీకే, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు హాజరవుతారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం సమావేశం జరుగుతుందని ఏడీఆర్‌ డాక్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-19T06:58:30+05:30 IST