స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర మంత్రికి వినతి
ABN , First Publish Date - 2021-07-25T05:48:26+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి పారస్ పాశ్వన్ను శనివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఉక్కుటౌన్షిప్, జూలై 24: విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి పారస్ పాశ్వన్ను శనివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ప్లాంట్ అని, ఉజ్వల భవిష్యత్ కలిగిన స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కమిటీ ప్రతినిధులు సీహెచ్.నరసింగరావు, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, జి.గణపతిరెడ్డి, వరసాల శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి ఉన్నారు.