ఆలయ భూములు పరిరక్షించాలని మంత్రికి వినతి

ABN , First Publish Date - 2020-10-20T06:29:04+05:30 IST

కీసరగుట్ట ఆలయ భూములు పరిరక్షించాలని కీసరకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం మంత్రి మల్లారెడ్డికి వినతిపతరం అందజేశారు

ఆలయ భూములు పరిరక్షించాలని మంత్రికి వినతి

కీసర: కీసరగుట్ట ఆలయ భూములు పరిరక్షించాలని కీసరకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం మంత్రి మల్లారెడ్డికి వినతిపతరం అందజేశారు.గతంలో రామన్న పూజారి పేరుపై ఉన్న ఆలయ భూములు నందిబావిగా ప్రాచుర్యంలో ఉన్నాయని స్థానికులు మంత్రికి వివరించారు. పూజారిపై ఉన్న భూముల రికార్డులు ఇతరుల పేర్లపైకి మార్చారని, తాజాగా ఆలయ భూములలో లేఅవుట్‌ చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి కీసరగుట్టకు సంబంధించి భూములపై సమగ్ర విచారణ జరపాలని మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లకు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్‌ గుప్తా పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-20T06:29:04+05:30 IST