పెన్షన్‌, సర్వీస్‌ రూల్స్‌ సమస్యలు పరిష్కరించాలని వినతి

ABN , First Publish Date - 2021-06-25T06:09:28+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ నాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నానిని కోరారు.

పెన్షన్‌, సర్వీస్‌ రూల్స్‌ సమస్యలు పరిష్కరించాలని వినతి
పేర్ని నానికి సమస్యలు వివరిస్తున్న ఎన్‌ఎంయూఏ నాయకులు

ద్వారకాబస్‌స్టేషన్‌, జూన్‌ 24 : ప్రజా రవాణా శాఖ (పీటీడీ) కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ నాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నానిని కోరారు. ఈ మేరకు గురువారం ఆయనను విజయవాడలో కలిసి వినతిపత్రం అందజేశారు.  కార్మికుల పెన్షన్‌, సర్వీస్‌ రూల్స్‌ వంటివి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి వివరించారు. మంత్రి దీనిపై స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులు ఆర్‌ సుబ్బారావు, శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్‌.రాజేష్‌కుమార్‌ ఉన్నారు.


Updated Date - 2021-06-25T06:09:28+05:30 IST