మైసమ్మ చెరువు కట్టకు మరమ్మతు
ABN , First Publish Date - 2020-10-01T10:21:01+05:30 IST
మండలంలోని కోడూరు మైసమ్మ చెరువు కట్టకు నెర్రలు రావడంతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్
మహబుబ్నగర్ రూరల్, సెప్టెంబరు 30: మండలంలోని కోడూరు మైసమ్మ చెరువు కట్టకు నెర్రలు రావడంతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్ ఎక్స్కవేటర్తో బుధవారం మరమ్మతు చేయించారు. కట్ట ఎత్తు పెంచుతూ, మరమ్మతు చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, నీటిపారుదల శాఖ డీఈ మనోహర్, ఏఈ శ్రీనివాసులు, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పి.నర్సింహులు, గ్రామ పెద్దలు చిన్నయ్యగౌడ్, బుచ్చన్న గౌడ్ పాల్గొన్నారు.