21 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
ABN , First Publish Date - 2020-09-19T10:03:55+05:30 IST
కొవిడ్-19 కారణంగా మార్చిలో మూతబడిన పాఠశాలలు ఈ నెల 21న పునఃప్రారంభం అవుతున్నాయని డీఈవో సాయిరాం శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 18: కొవిడ్-19 కారణంగా మార్చిలో మూతబడిన పాఠశాలలు ఈ నెల 21న పునఃప్రారంభం అవుతున్నాయని డీఈవో సాయిరాం శుక్రవారం తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది హాజరుపై మార్గదర్శకాలు విడుదలయ్యాయని అన్నారు. కంటైన్మంట్ జోన్లలో లేని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.
21న మొత్తం సిబ్బంది పాఠశాలలకు హాజరు కావాలని సూచించారు. 22వ తేదీ నుంచి 50 శాతం సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి విద్యార్థులు లిఖిత పూర్వక అనుమతి తీసుకుని ప్రధానోపాధ్యాయునికి తప్పక సమర్పించాల్సి ఉంటుందని డీఈవో తెలిపారు.