HYD : అద్దె కార్లు తనఖా పెట్టి జల్సాలు..

ABN , First Publish Date - 2022-01-15T12:09:49+05:30 IST

కార్లను అద్దెకు తీసుకుని తనఖా పెట్టి జల్సాలు చేస్తున్న

HYD : అద్దె కార్లు తనఖా పెట్టి జల్సాలు..

హైదరాబాద్‌ సిటీ : కార్లను అద్దెకు తీసుకుని తనఖా పెట్టి జల్సాలు చేస్తున్న ఇద్దరిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసి‌ఫ్‌నగర్‌ పోలీసులతో నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో వారి నుంచి రూ.40 లక్షల విలువ చేసే మూడు కార్లు, ఓ మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌బాగ్‌ నివాసి మహ్మద్‌ సల్మాన్‌(30) అలియాస్‌ డాన్‌ కారు డ్రైవర్‌. ముగ్గురి వద్ద అద్దెకు కార్లు తీసుకున్నాడు. వాటిని తనఖా పెట్టేవాడు. 2020 లోనూ సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత కిషన్‌బాగ్‌ నివాసి మహ్మద్‌ హుస్సేన్‌(21)తో కలిసి అదే ప్లాన్‌ చేశాడు. పలు చోట్ల కార్లు అద్దెకు తీసుకుని వాటిని తనఖా పెట్టిన వారిని అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2022-01-15T12:09:49+05:30 IST