మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ థాకరే ultimatum

ABN , First Publish Date - 2022-04-13T12:41:35+05:30 IST

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా అల్టిమేటం ఇచ్చారు....

మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ థాకరే ultimatum

మే 3లోగా మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను తొలగించండి

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా అల్టిమేటం ఇచ్చారు.మే 3వతేదీలోగా మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాజ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.థానేలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాజ్ థాకరే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 3వతేదీలోపు శివసేన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే, తమ ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు మసీదుల ముందు హనుమాన్ చాలీసా వాయిస్తారని రాజ్ హెచ్చరించారు.లౌడ్ స్పీకర్లు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆయన చెప్పారు. 



తాను ఏ ప్రార్థనలకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజలు తమ నివాసాల్లో తమ విశ్వాసాన్ని అనుసరించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని రాజ్ కోరారు. మే 3వతేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను తొలగించకుంటే తదుపరి చర్యలకు తాను, తన పార్టీ కార్యకర్తలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-13T12:41:35+05:30 IST