ఆలయ ప్రాంగణంలో పిచ్చిమొక్కల తొలగింపు
ABN , First Publish Date - 2021-06-19T06:28:00+05:30 IST
నిర్మల్ పట్టణంలోని దేవరకోట దేవస్థాన ఆలయ ప్రాంగణాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పరిశీలించారు.
నిర్మల్ టౌన్, జూన్ 18 : నిర్మల్ పట్టణంలోని దేవరకోట దేవస్థాన ఆలయ ప్రాంగణాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశానుసారం దేవరకోట దేవస్థాన ఆలయ ప్రాంగ ణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తౌహిద్దీన్, ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మి నారాయణ, ఆలయ ధర్మకర్త డికొండ పద్మనాభం, కత్తి సుధాకర్, కోఆప్షన్ చిలుక గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.