రెండు క్రస్ట్గేట్ల నుంచి నీటి విడుదల
ABN , First Publish Date - 2020-10-31T07:38:19+05:30 IST
ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రెండు క్రస్ట్గేట్లను శుక్ర వారం 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
నాగార్జునసాగర్/ చింతలపాలెం/ కేతేపల్లి, అక్టోబరు 30: ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రెండు క్రస్ట్గేట్లను శుక్ర వారం 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450 టీఎం సీలు) కాగా; ప్రస్తుతం 589.90 (311.7462టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి కుడికాల్వకు 9700క్యూసెక్కులు, ఎడమకాల్వకు 8807క్యూసెక్కులు, పవర్హౌస్కు 25,334క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ 2400, క్రస్ట్గేట్ల నుంచి 29,986క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 76,227క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేమొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండ లంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 (45.77టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుత్తం 174.86 (45.56టీఎంసీలు) అడుగులకు చేరుకుంది.
ఎగువ నుంచి 20,971 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం ఇన్ఫ్లో ఇన్ ఫ్లో తగ్గింది. గురువారం సాయంత్రం 3,037క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా శుక్రవారం సాయంత్రానికి 1,707క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు 645 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలోకి రావడంతో అధికారులు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను ఆయకట్టుకు 365క్యూసెక్కులు, రెండు క్రస్టుగేట్లు ఎత్తి 992క్యూసెక్కులు, మొత్తం 1400క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.