జిల్లాలో 89 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-10-01T10:17:09+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బుధ వారం 89 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. బోధన్‌లో బుధవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి

జిల్లాలో 89 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

బోధన్‌, సెప్టెంబరు 30 : జిల్లా వ్యాప్తంగా బుధ వారం 89 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. బోధన్‌లో బుధవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాకాసీపేట అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో ఏడుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ వచ్చాయి. పాన్‌గల్లి అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


సాలూర పీహెచ్‌సీ పరిధిలో ఒకరికి 

బోధన్‌ మండలం సాలూర పీహెచ్‌సీ పరిధిలో బుదవారం ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 22 మం దికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 


డిచ్‌పల్లిలో ముగ్గురికి కరోనా 

డిచ్‌పల్లి : స్థానిక సీహెచ్‌సీలో బుధవరం 51 మం దికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురికి పాజిటివ్‌ ఉన్నట్లు పార్మాసిస్ట్‌ అనిత తెలిపారు. 


ఎడపల్లిలో ముగ్గురికి 

నవీపేట(ఎడపల్లి) : ఎడపల్లి మండలంలో బుధ వారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయని వైద్యాధికారులు తెలిపారు. స్థానిక ప్రభు త్వ ఆసుపత్రిలో 14 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వ హించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. 


వర్ని మండలంలో ఇద్దరికి

వర్ని : మండల కేంద్రంలో బుఽధవారం 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సత్యనారాయణపురం లో ఒకరికి, అక్బర్‌నగర్‌లో ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 


కోటగిరి మండలంలో నాలుగు 

కోటగిరి : మండలంలో బుధవారం నాలుగు కరో నా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పోతంగల్‌ ఆరోగ్య కేంద్రంలో 60 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వ హించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు సూపర్‌ వైజర్‌ కృష్ణవేణి తెలిపారు. కోటగిరిలో 14 మందికి టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 


భీమ్‌గల్‌లో ఏడుగురికి... 

భీమ్‌గల్‌ : స్థానిక పీహెచ్‌సీలో బుధవారం 38 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ సుచరిత రామన్నపేట్‌లో ఇద్దరికి, పురాణిపేట్‌లో ఒకరి, బాబాపూర్‌లో ఒకరికి, పిప్రిలో ఒకరికి, ముచ్కూర్‌లో ఒకరికి, బడాభీమ్‌గల్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు.  


వేల్పూర్‌లో ముగ్గురికి.. 

వేల్పూర్‌ : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో 16 మందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు అశోక్‌, వెంకటరమణ తెలిపారు. 


బాల్కొండలో ఆరుగురికి... 

బాల్కొండ : బాల్కొండ, కిసాన్‌నగర్‌ పీహెచ్‌సీల్లో బుధవారం నిర్వహించిన ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్ష ల్లో ఆరు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు డాక్టర్‌ రవిశంకర్‌ తెలిపారు. బాల్కొండ ఐదుగురికి, కిసాన్‌నగర్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు.


కరోనాతో వ్యక్తి మృతి

నవీపేట : మండలంలోని రాంపూర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. శుక్ర వారం నవీపేట ప్రభుత్వ ఆసుప త్రిలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిం చగా కరోనా పాజిటివ్‌ రావడంతో ని జామాబాద్‌కు ఆసుపత్రికి తరలించారు. అతడి అంత్యక్రియలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం రాంపూర్‌లో నిర్వహించారు. 

Updated Date - 2020-10-01T10:17:09+05:30 IST